Saturday, October 8, 2016

ఏబీసీ ఛైర్మన్‌గా ఐ.వెంకట్‌


 దేశంలోని వార్తాపత్రిక సర్క్యులేషన్‌ను నిర్ధరించే సంస్థ ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ) ఛైర్మన్‌గా ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ ఎన్నికయ్యారు. 2016-17కు గాను ఏబీసీ ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌గా దేబబ్రత్‌ ముఖర్జీ (కోకకోలా ఇండియా, మార్కెటింగ్‌, కమర్షియల్‌ విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌), గౌరవ కార్యదర్శిగా హేమంత్‌ మాలిక్‌ (ఐటీసీ లిమిటెడ్‌), గౌరవ కోశాధికారిగా మధుకర్‌ కామత్‌ (డీడీబీ ముద్ర ప్రైవేట్‌ లిమిటెడ్‌), సెక్రటరీ జనరల్‌గా హార్‌ ముజ్ద్‌ మసాని ఎన్నికయ్యారు. ఐ.వెంకట్‌ మీడియా రిసెర్చ్‌ యూజర్స్‌ కౌన్సిల్‌ (ఎంఆర్‌యూసీ) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

No comments:

Post a Comment