Thursday, October 6, 2016

మద్య నిషేధం పిల్‌ పరిశీనకు సుప్రీంకోర్టు తిరస్కరణ


దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) పరిశీలించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగం ప్రకారం జాతీయ మద్యం విధానం అనేది ఆదేశిక సూత్రాల్లో భాగమని, ఇందులో కార్యనిర్వాహక వర్గానికి అన్ని హక్కులు ఉన్నాయని జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ పిల్‌ను పరిశీలించలేమని స్పష్టం చేసింది. దీంతో పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది, ఢల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్‌ దాన్ని ఉపసంహరించుకున్నారు.

No comments:

Post a Comment