Wednesday, October 12, 2016

జాతీయ సీనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌

టీమ్‌ ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌, తెలుగు తేజం మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌ (ఎంఎస్‌కే ప్రసాద్‌) కు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ సీనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌ ఎంపికయ్యాడు. ఈ పదవిలో మూడేళ్లు ఉంటాడు. ఎంఎస్‌కే నేతృత్వంలో మొత్తం ఐదుగురితో కొత్త సెక్షన్‌ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. గగన్‌ ఖోడా (సెంట్రల్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌), జతిన్‌ పరాంజపే (వెస్ట్‌ జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌) కు సెక్షన్‌ కమిటీలో చోటు దక్కింది. జూనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ మరోసారి నియమితుడయ్యాడు. రాకేష్‌ పారిఖ్‌, ఆశిష్‌ కపూర్‌, అమిత్‌ శర్మ, జ్ఞానేంద్ర పాండేకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. మహిళ సెక్షన్‌ కమిటీకి హేమలత ఛైర్మన్‌గా ఎంపికైంది. సీనియర్‌ సెక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన తొలి తెలుగువాడు లక్నల్‌ సీకే నాయుడు. 

No comments:

Post a Comment