Thursday, October 6, 2016

ఏపీలో ఇక తెలుగు తప్పనిసరి


తెలుగు భాష అభివృద్ధిలో భాగంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై పేర్లను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని కూడా తెలుగులోనే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలపై వివరాలను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, శాఖాపతులను ప్రభుత్వం ఆదేశించింది.

No comments:

Post a Comment