Wednesday, October 12, 2016

ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు షీమోన్‌ పెరేజ్‌ మృతి

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు షీమోన్‌ పెరేజ్‌ (93) టెల్‌ హషోమెర్‌లో 2016 సెప్టెంబర్‌ 28న మరణించారు. ఆయన రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా, విదేశాంగ, ఆర్థికమంత్రిగా పనిచేశారు. పాస్తీనాతో శతాబ్ద కాలం నాటి విరోధాన్ని ముగించడానికి చేసిన కృషి (ఓస్లో శాంతి ఒప్పందం)కిగాను 1994లో ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. షీమెన్‌కు భారత్‌ అంటే అభిమానం. భూమిపై అతిగొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను అభివర్ణించారు. మహాత్మగాంధీని ‘ప్రవక్త’గా జవహర్‌లాల్‌ నెహ్రూను ‘రాజు’ గాను ఆయన అభివర్ణించేవారు. 

No comments:

Post a Comment