Sunday, October 9, 2016

సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029 డాక్యుమెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తలసరి ఆదాయం మరో 13 ఏళ్లలో రూ.5.07 లక్షలు సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దార్శనిక పత్రం (సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029 డాక్యుమెంట్‌)ను ఆవిష్కరించింది. 2016 సెప్టెంబర్‌ 28న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పత్రాన్ని విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరం రూ.5.2 లక్షల కోట్లున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2029-30 నాటికి రూ.28.45 లక్షల కోట్లకు చేరుకుంటుందని, ఫలితంగా తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.90,517 నుంచి రూ.5.07 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాలకు లక్ష్యాలతోపాటు, కాలపరిమితినీ నిర్ధేశించింది.
ముఖ్యాంశాలు:
2019: అందరికీ జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు
2019: ప్రతి పంచాయతీలో ఒక మీసేవ కేంద్రం
2020: దేశానికి నైపుణ్య రాజధానిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం. 1.30 కోట్ల మందికి నైపుణ్యాలు నేర్పించడం.
2020: స్వయం సహాయక సంఘా సభ్యుల సంఖ్య 1.17 లక్షలకు పెంపు. వీరికి రూ.28 వేల కోట్ల రుణం కేటాయింపు.
2020: దేశంలోనే అత్యంత వ్యాపారానుకూలత రాష్ట్రంగా ఎదుగుదల.
2020: అందరికీ ఇళ్ల కల సాకారం. ఆకర్షణీయ నగరాలుగా మరో తొమ్మిది అభివృద్ధి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 40 లక్షల ఇళ్ల నిర్మాణం.

No comments:

Post a Comment