Thursday, October 6, 2016

సూర్యనారాయణమూర్తికి దీన్‌దయాళ్‌ జోనల్‌ అవార్డు


పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా ఏటా జాతీయ, జోనల్‌ స్థాయిల్లో ఇచ్చే ఉత్తమ రైతు పురస్కారానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన  సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి జోన్‌ నుంచి ఈయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. దేశంలో జాతీయ స్థాయిలో ఒక రైతుకు, 11 జోన్ల నుంచి ఒక్కొక్కరికి ఈ అవార్డు అందజేస్తారు. జాతీయస్థాయి అవార్డు పొందినవారికి రూ.లక్ష, జోనల్‌ స్థాయి అవార్డు పొందినవారికి రూ.50 వేలు అందిస్తారు. దీన్‌దయాళ్‌ జాతీయ అవార్డుకు నజఫ్‌గడ్‌కు చెందిన మహిళా రైతు కృష్ణయాదవ్‌ ఎంపికయ్యారు.

No comments:

Post a Comment