Friday, August 18, 2023

యాంటీబయాటిక్‌ అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ

  • వైద్యుల సలహా లేకుండానే మందుల షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్‌ ఔషధాలు కొని వాడటం భారత్‌లో సర్వసాధారణం! దీనికితోడు కొవిడ్‌-19 సమయంలో టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడి వాడకం వల్ల రోగకారక బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంపాదించాయి. మరోవైపు మానవులు విసర్జించిన యాంటీ బయాటిక్స్‌ నీటి వనరుల్లో చేరిపోతున్నాయి. అవి ఇతర జీవులకు, పర్యావరణానికీ తీరని హాని కలిగిస్తాయి. 
  • పర్యావరణంలో కలసిపోయిన టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ మందుల అవశేషాలను నిర్మూలించే పద్ధతిని ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. నవీన్‌కుమార్‌ నవానీ నాయకత్వంలోని ఈ బృందంలో కిరణ్‌ అంబటిపూడి అనే తెలుగు పరిశోధకుడూ ఉన్నారు. 
  • వీరు కనుగొన్న ప్రక్రియ యాంటీబయాటిక్స్‌తోపాటు రసాయన కాలుష్యాన్నీ నిర్మూలించగలదు. ఈ ప్రక్రియలో మొదట నీటిలో చేరిన యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్‌ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్‌ ఆధారిత నానోట్యూబ్‌లతో నీటిలోని యాంటీబయాటిక్స్‌ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సాయంతో విచ్ఛిన్నం చేస్తారు. 
  • ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే 93 శాతం యాంటీబయాటిక్‌ అవశేషాలను నిర్మూలించవచ్చు. నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నం చేయవచ్చు.

No comments:

Post a Comment