Tuesday, August 15, 2023

Pakisthan : పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు


  • పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ప్రధాని షెప్‌ాబాజ్‌ షరీఫ్‌ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. 
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకు ముందు జాతీయ అసెంబ్లీని రద్దుచేయాల్సిందిగా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షుడికి లేఖ రాశారు. దీంతో 2023 ఆగస్టు 9 అర్ధరాత్రి పాక్‌ అధ్యక్షుడు అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. 
  • ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌ పార్లమెంట్‌ దిగువసభతో పాటు ముస్లిం లీగ్‌- నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దైంది. ఇక త్వరలోనే ఆ దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. 
  • ఆగస్టు 9న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రధానిగా షప్‌ాబాజ్‌ షరీఫ్‌ చివరి ప్రసంగం చేశారు. సభ అనుమతితో జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని అధ్యక్షుడికి చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
  • ఇక గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. 
  • పాక్‌లో కొత్త జనాభా గణన ఫలితాలు రావడంతో ఎన్నికలకు ముందే నియోజక వర్గాల విభజన చేయాల్సి ఉంది. 120 రోజుల్లో డీలిమిటేషన్‌ నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావించింది. 
  • 2018 జులై 25న ఆ దేశ ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 13న 15వ పాక్‌ జాతీయ అసెంబ్లీ కొలువుదీరింది. ఇక ఎన్నికలు నిర్వహించేవరకు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది. 

ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్లు అనర్హత వేటు

  • తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయి అటక్‌ జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు ఎదురుదెబ్బ తగిలింది. 
  • మూడేళ్లు జైలుశిక్ష పడ్డ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌పై అయిదేళ్లపాటు అనర్హత వేటు వేస్తున్నట్లుగా పాక్‌ ఎన్నికల సంఘం 2023 ఆగస్టు 8న ప్రకటన జారీ చేసింది. 
  • మరోవైపు.. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని ఆగస్టు 9న రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్‌ పునరుద్ఘాటించారు. 

తోషాఖానా బహుమతులను వేలానికి పెట్టిన ప్రధాని షెహబాజ్‌

  • పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు. 
  • ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష విధించింది. ఈ పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని రోజుల్లోనే షెహబాజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
  • పాకిస్థాన్లో 1974లో క్యాబినెట్‌ డివిజన్‌ కింద పనిచేసేలా తోషాఖానా డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. 
  • దీనిలో ప్రభుత్వ అధినేతకు, పార్లమెంట్‌ సభ్యులకు, అధికారులకు విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులను భద్రపర్చుతారు. 
  • కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. 
  • ఆయన దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం ధర చెల్లించాలి. 
  • కానీ, ఇందులో రూ.38 లక్షల గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఆయన  జైలు శిక్షను అనుభవిస్తున్నారు. 

No comments:

Post a Comment