Monday, August 22, 2016

ఇద్దరు ఏపీ నేత కార్మికులకు జాతీయ చేనేత పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఇద్దరు నేత కార్మికులు జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు. చేనేత కళలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏటా వీటిని ప్రకటిస్తుంది. 2015కి గాను దేశవ్యాప్తంగా 23 మంది ఎంపికవ్వగా, ఈ జాబితాలో వెంకటగిరికి చెందిన పట్నం చీరా రెడ్డి, శ్రీకాకుళంకు చెందిన బి.రమేష్‌ ఉన్నారు. వీరు జాందానీ నేత చీరపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

No comments:

Post a Comment