Thursday, August 3, 2023

వీరన్నగుట్ట అభివృద్ధే లక్ష్యం : కొప్పుల


ఎల్‌బీనగర్‌, సక్సెస్‌ సీక్రెట్‌ :
వీరన్నగుట్టను అన్ని విధాల అభివృద్ది చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కాలనీలో పర్యటించి, పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ..త్వరలోనే సత్తయ్య డబ్బా నుంచి స్వాతి రెసిడెన్సి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాలనీలోని మిగతా బోర్లలో నూతన మోటార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కడారి యాదగిరి యాదవ్‌, కోటయ్య, మంగయ్య, రమేష్‌చారి, గోల్కొండ బాలాజినాయుడు, శంకర్, చింటు,  శ్రీనివాస్‌, చిన్నాయాదవ్‌, వినోద్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.   





No comments:

Post a Comment