Thursday, August 3, 2023

ఏ రాష్ట్ర రాజ్‌భవన్‌లో ఇటీవల అవినీతి నిరోధక సెల్‌ ఏర్పాటు చేసారు?


  • పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 2023 ఆగస్టు 2న ‘అవినీతి నిరోధక సెల్‌’ను ప్రారంభించారు. అవినీతి, ప్రజా సమస్యల గురించి అందులో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వాటిని తాము పంపిస్తామని పేర్కొన్నారు. 
  • ఈ పరిణామంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భాజపా ఆదేశాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.

No comments:

Post a Comment