భారత్లోని హిందువులు అపరిశుభ్రంగా, మురికిగా ఉంటారని మలేషియాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాయం తమ బోధనాంశంలో అభివర్ణించడం వివాదాస్పదమైంది. దీనిపై అల్పసంఖ్యాక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూనివర్సిటీ టెక్నాలజీ మలేషియా(యుటియం) ఆన్లైన్లో పోస్ట్ చేసిన బోధనాంశ స్లైడ్లు ఈ వివాదానికి కారణమయ్యాయి. హిందువులు తమ శరీరంపై మురికిని నిర్వాణ సాధనకు మతపరమైన ఆచారాల్లో భాగంగా పరిగణిస్తారని స్లైడ్స్లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment