Tuesday, September 13, 2016

సెర్బ్‌ల మాజీ నేత రదోవాన్‌ కరాజిక్‌కు 40 ఏళ్ల కారాగార శిక్ష

బోస్నియాకు చెందిన సెర్బ్‌ల మాజీ నేత రదోవాన్‌ కరాజిక్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం 40 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. సామూహిక హత్యాకాండ సహా తొమ్మిది అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. బోస్నియాలో 1992-95 మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు లక్షమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధనేరాల్లో రదోవాన్‌ దోషి అని యుగోస్లావియా యుద్ధనేరాల ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే తేల్చింది. ఎనిమిదివేల మంది ముస్లింల ఊచకోతకు అతడు బాధ్యుడని పేర్కొంది.

No comments:

Post a Comment