అమెరికాలోనే అత్యంత ధనవంతులు, స్వయంకృషితో విజయతీరాలను చేరిన 60 మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వార్షిక జాబితాను ఫోర్స్స్ విడుదల చేసింది. ఇందులో భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. కొత్త విషయాలు, వినూత్నతతో పరిమితులను అధిగమించి విజయాలను దక్కించుకున్న ఈ మహిళల్లో భారత్లో జన్మించిన నీర్జా సేథి(61)కి 16వ స్థానం, జయశ్రీ ఉల్లాల్(55)కు 30వ స్థానం లభించాయి. మొత్తం జాబితాలో ఏసీసీ సప్లై యజమానురాలు డయానే హెడ్రిక్స్ అగ్రస్థానంలో నిలిచారు.
No comments:
Post a Comment