Sunday, September 11, 2016

సంస్థల ఆస్తుల విభజన కోసం కేంద్రంతో చర్చకు బాలసుబ్రహ్మణ్యం, కుటుంబరావు



పునర్విభజన చట్టం-2014 పదో షెడ్యూులులో ఉన్న సంస్థల ఆస్తుల విభజన కోసం కేంద్రంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున రిటైర్డ్‌ ఐఏఎస్‌ బాల సుబ్రహ్మణ్యం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి చర్చ కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఇద్దరు వంతున పేర్లను పంపాలని కేంద్రం ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసింది. 10వ షెడ్యూులులో 142 సంస్థలు ఉన్నాయి. ఏపీ ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులో రెండు నెలల్లో కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో సభ్యులుగా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు వంతున ఉండాలని, వారి పేర్లను పంపించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో వీరి ఎంపిక జరిగింది.

No comments:

Post a Comment