కృష్ణపట్నం ఓడరేవు చైనాకు ప్రతి వారం కంటెయినర్ నౌకా సేవలను అందుబాటులోకి తెచ్చింది. పోర్టులోని రెండో బెర్తుపై మాస్క్ కైరెనియా అనే నౌకను ప్రారంభించారు. గతంలో ఈ రేవు నుంచి చైనాకు నౌక వెళ్లేందు కు 25 రోజుల సమయం పట్టేదని, ప్రస్తుత సర్వీసుతో 14 రోజులు పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంటెయినర్ సేవ ద్వారా చైనా, కొరియా, సింగపూర్, మలేషియా దేశాలతో వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment