Monday, September 12, 2016

రోదసిలో తొలిసారి జన్యు క్రమం ఆవిష్కరణ


రోదసిలో తొలిసారిగా జన్యు క్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఆవిష్కరించింది. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఈ ఘనతను సాధించింది. బయోమాలిక్యూల్‌ సీక్వెన్సర్‌ ప్రయోగంలో భాగంగా సూక్ష్మ గురుత్వ శక్తి వాతావరణంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రయోగాన్ని నాసా వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ నిర్వహించారు. మిన్‌ అయాన్‌ అనే డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ పరికరం సాయంతో ఎుకు, వ్కెరస్‌, బ్యాక్టీరియా డీఎన్‌ఏ నమూనాను విశ్లేషించారు. నిర్దిష్ట డీఎన్‌ఏ క్రమాన్ని గుర్తించారు. అంతరిక్షంలో డీఎన్‌ఏనూ ఆవిష్కరించే విధానం వ్ల వ్యోమగాముకు రోగ నిర్ధారణ చేయడానికి, ఐఎస్‌ఎస్‌లో వృద్ధి చెందుతున్న సూక్ష్మజీవును గుర్తించడానికి, వాటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందా లేదా అన్నది తేల్చడానికి వీలు కలుగుతుందని నాసా పేర్కొంది.
NASA-National Aeronautics and Space Administration
ISS-International Space Station 

No comments:

Post a Comment