2016 సం॥నికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పి.వి.సింధుకు దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్రత్న దక్కింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇదే ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన కుస్తీ యోధురాలు సాక్షిమాలిక్, త్రుటిలో పతకం చేజారినా.. అద్భుత విన్యాసాలతో అబ్బురపర్చిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటింగ్లో నిలకడ ప్రదర్శనతో ఆకట్టుకున్న జీతూరాయ్కు కూడా కేంద్రం ఖేల్రత్న ప్రకటించింది. దేశ క్రీడా పురస్కారాల చరిత్రలో తొలిసారి నలుగురు క్రీడాకారులకు ఒకేసారి ఖేల్రత్న ప్రకటించింది. 2016 సం॥నికి గాను క్రీడా మంత్రిత్వశాఖ ఖేల్రత్నతోపాటు ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్చంద్ పురస్కారాలను కూడా ప్రకటించింది.
రాజీవ్ ఖేల్రత్న అవార్డు :
క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో నాలుగేళ్లు అత్యంత అద్భుత ప్రదర్శన చేసిన వారికి ఖేల్రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7 లక్షల నగదును అందజేస్తారు.విజేతలు
1. పి.వి.సింధు బ్యాడ్మింటన్
2. సాక్షిమాలిక్ రెజ్లింగ్
3. దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్
4. జీతూరాయ్ షూటింగ్
ద్రోణాచార్య అవార్డు :
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో పతక విజేతను తయారుచేసిన శిక్షకులకు ద్రోణాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కార విజేతకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు.విజేతలు
1. నాగపురి రమేష్ అథ్లెటిక్స్
2. సాగర్ మాల్ దయాళ్ బాక్సింగ్
3. రాజ్కుమార్ శర్మ క్రికెట్-విరాట్ కొహ్లీ గురువు
4. బిశ్వేశ్వర్ నంది జిమ్నాస్టిక్ - దీపా కర్మాకర్ గురువు
5. ఎస్. ప్రదీప్ కుమార్ ఈత, జీవితకాలం
6. మహబీర్ సింగ్ కుస్తీ, జీవితకాలం
నాగపురి రమేష్
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
అర్జున అవార్డు :
నాలుగేళ్లపాటు నికడగా ప్రతిభను కనబర్చిన వారికి అర్జున పురస్కారాన్ని అందజేస్తారు. పురస్కార విజేతలకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు.విజేతలు
1. రజత్ చౌహాన్ ఆర్చరీ
2. లితా బాబర్ అథ్లెటిక్స్
3. సౌరవ్ కొథారీ బిలియర్డ్స్, స్నూకర్
4. శివ ధాపా బాక్సింగ్
5. అజింక్య రహానే క్రికెట్
6. సుచిత్ర పాల్ ఫుట్బాల్
7. రాణి హాకీ
8. వి.ఆర్.రఘునాథ్ హాకీ
9. గురుప్రీత్సింగ్ షూటింగ్
10. అపూర్వీ చండేలా షూటింగ్
11. సౌమ్యజిత్ ఘోష్ టేబుల్ టెన్నిస్
12. వినేష్ కుస్తీ
13. అమిత్ కుమార్ కుస్తీ
14. సందీప్ సింగ్ మాన్ పారా అథ్లెటిక్స్
15. వీరేంద్ర సింగ్ కుస్తీ, బధిర
ధ్యాన్చంద్ అవార్డు :
క్రీడల అభివృద్ధికి జీవితకాలం కృషిచేసిన వారికి ధ్యాన్చంద్ పురస్కారాన్ని అందజేస్తారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ పురస్కార విజేతలకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు. విజేతలు
1. సత్తి గీత అథ్లెటిక్స్
2. స్వినస్ డంగ్డంగ్ హాకీ
3. రాజేంద్ర ప్రల్హాద్షెల్కె రోయింగ్
సత్తి గీత
భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్, భారత మాజీ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) డైరెక్టర్ సత్తి గీత ఇద్దరూ తెలుగువారు.
SAAP-Sports Authority of Andhra Pradesh




No comments:
Post a Comment