Monday, September 12, 2016

రియో ఒలింపిక్స్‌-2016


బ్రెజిల్‌ రాజధాని రియో డిజెనీరోలో 2016 ఆగస్టు 5 నుంచి 21 వరకు 31వ వేసవి ఒలింపిక్‌ క్రీడలు జరిగాయి. వీటిని రియో ఒలింపిక్స్‌ అంటారు. ఈ ఒలింపిక్‌ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు ప్రధాన స్టేడియం (మారకానా స్టేడియం)లో జరిగాయి. అంత్జరాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ సమక్షంలో బ్రెజిల్‌ తాత్కాలిక అధ్యక్షుడు మిచెల్‌ తెమెర్‌ ఒలిం పిక్స్‌ ప్రారంభమైనట్లు ప్రకటించారు.

  • రియో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో 306 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు
  • 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో 26 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి
  • రియో ఒలింపిక్స్‌లో రగ్బీ సెవెన్స్‌ క్రీడను తొలిసారి ప్రవేశపెట్టారు
  • 112 సం॥ తర్వాత గోల్ఫ్‌ క్రీడను తిరిగి రియోలో పునఃప్రారంభించారు. 
  • ఒలింపిక్స్‌లో మొత్తం 207 దేశాలకు చెందిన క్రీడా బృందాలు వివిధ పోటీల్లో పాల్గొన్నాయి
  • రియో ఒలింపిక్స్‌ నినాదం - ఒక కొత్త ప్రపంచం
  • రియో ఒలింపిక్స్‌ మస్కట్‌ - వినిషియస్‌ 
  • ఆకుపచ్చరంగులో వివిధ జంతువుల ఆకృతులను కలిగిన ఈ చిహ్నం బ్రెజిల్‌ జంతు జీవవైవిధ్యానికి ప్రతీక
  • ప్రఖ్యాత బ్రెజిల్‌ సంగీతకారుడు దివంగత వినిషియస్‌ డిమొరెస్‌ జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు
  • 32వ ఒలింపిక్‌ క్రీడలు 2020లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్నాయి

రియో ముఖ్యాంశాలు

  • రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అమెరికాకు చెందిన గిన్ని త్రాసర్‌ గెలుచుకుంది. ఈమె మహిళ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పతకాన్ని సాధించింది. 
  • కోసోవో, దక్షిణ సూడాన్‌ దేశాు ఒలింపిక్స్‌లో మొదటిసారి పాల్గొన్నాయి
  • రియో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌ స్వర్ణాన్ని నెయ్‌మార్‌ సారధ్యంలోని బ్రెజిల్‌ జట్టు గెలుపొందింది. పురుషుల హాకీ స్వర్ణాన్ని అర్జెంటీనా సాధించింది
  • పురుషుల 100 మీటర్ల పరుగు (స్ప్రింట్‌) పోటీలో జమైకాకు చెందిన ఉసెన్‌ బోల్డ్‌ స్వర్ణం సాధించాడు. ఇతడు 9.81 సెకన్లలో పరుగును పూర్తిచేశాడు. మహిళ 100 మీటర్ల పరుగును జమైకాకు చెందిన ఎలైనె థాంప్సన్‌ 10.71 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని సాధించింది
  • 400 మీ. పరుగులో దక్షిణాఫ్రికాకు చెందిన వేడ్‌ వాన్‌ నీకర్క్‌ 43.03 సెకన్లలో పూర్తి చేసి మైఖేల్‌ జాన్సన్‌ (అమెరికా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు(43.18 సెకన్లు)ను అధిగమించాడు
  • రియో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ స్వర్ణాన్ని బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే గెలుపొందాడు. ముర్రేకు ఇది వరుసగా రెండో టెన్నిస్‌ ఒలింపిక్‌ స్వర్ణం. మహిళ సింగిల్స్‌ స్వర్ణాన్ని మోనికా ప్యూగ్‌ (ప్యూర్టోరికో)  గెలుపొందింది.
  • రియో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలను మైఖేల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌ : 5 స్వర్ణాలు, 1 రజతం), కెటీ లెడెకి (స్విమ్మింగ్‌ : 4 స్వర్గాలు, 1 రజతం), సైమన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌ : 4 స్వర్ణాలు,  1 కాంస్యం) సాధించి 
  • మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ముగ్గురూ అమెరికా క్రీడాకారులే.  గత మూడు ఒలింపిక్స్‌లో మూడు ఫార్మాట్ల (100 మీ., 200 మీ. 400 మీ. రిలే)లో స్వర్ణాలు నెగ్గి ట్రిపుల్‌ ట్రిపుల్‌ సొంతం చేసుకున్న తొలి అథ్లెట్‌గా ఉసెన్‌ బోల్డ్‌ నిలిచాడు
  • రియో ఒలింపిక్స్‌లోని ఆర్చరీ విభాగంలో దక్షిణకొరియా 4 స్వర్ణాలు గెలుపొంది ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో 121 పతకాలు సాధించిన అమెరికా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోకూడా అమెరికా 104 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది
  • రియో ఒలిపింక్స్‌లో 67 పతకాలు సాధించిన గ్రేట్‌ బ్రిటన్‌ 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో నిలిచాయి
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 87 పతకాలతో చైనా 2వ స్థానంలో నిలిచింది
  • ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశంగా అమెరికా రికార్డు సృష్టించింది
  • రియో ఒలింపిక్స్‌లో 46 స్వర్ణాలు సాధించిన అమెరికా మొత్తంమీద వెయ్యికి పైగా (1022) స్వర్ణాలు గెలుచుకుంది
  • 31 వ ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశమైన బ్రెజిల్‌ 19 పతకాల (7,6,6) తో పతకాల పట్టికలో 13 వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండిపెండెంట్‌ ఒలింపిక్‌ అథ్లెట్లు ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకాలను సాధించారు
  • ఫె˜హైద్‌ ఆల్‌ దిహానీ షూటింగ్‌ మెన్స్‌ డబుల్‌ ట్రాప్‌ విభాగంలో స్వర్ణం సాధించి, బంగారు పతకం సాధించిన తొలి స్వతంత్ర ఆటగాడిగా నిలిచాడు
  • భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకాలను సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో మొత్తం 87 దేశాలు పతకాలుగెలుపొందాయి. 59 దేశాలు కనీసం ఒక బంగారు పతకాన్ని సాధించాయి. (ఇండిపెండెంట్‌ ఒలింపిక్‌ టీమ్‌తో కలిపి)
  • మహిళ 100 మీ. ఫ్రీస్టయిల్‌ ఈతలో ఒకే ఈవెంట్‌లో ఇద్దరికి పసిడి పతకాలను ప్రదానం చేశారు. పురుషుల 100 మీటర్ల బటర్‌ ఫ్లై ఈతలో ఒకే ఈవెంట్‌లో ముగ్గురికి రజత పతకాలను అందించారు
  • రియో ఒలింపిక్స్‌లో 307 స్వర్ణాలు, 307 రజతాలు, 360 కాంస్యాలతో మొత్తం 974 పతకాలను ప్రదానం చేశారు

రియోలో భారత్‌...
రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున 121 మంది క్రీడాకారులు 15 క్రీడాంశాల్లో పాల్గొన్నారు

  • అథ్లెటిక్స్‌            36
  • హాకీ            32 
  • షూటింగ్‌            12 
  • రెజ్లింగ్‌             8 
  • బ్యాడ్మింటన్‌      7
  • ఆర్చరీ             4 
  • టెన్నిస్‌             4 
  • టేబుల్‌ టెన్నిస్‌     4 
  • బాక్సింగ్‌             3 
  • గోల్ఫ్‌                     3
  • వెయిట్‌లిఫ్ట్టింగ్‌     2 
  • స్విమ్మింగ్‌             2 
  • జిమ్నాస్టిక్స్‌     1
  • రోయింగ్‌             1
  • జూడో                     1
  • రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకారులు  సాధించి, పతకాల పట్టికలో 67 వ స్థానంలో నిలిచింది.
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 6 పతకాలు (0, 2, 4)తో 55వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలిపింక్స్‌  ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి అభినవ్ బింద్రా, ముగింపు వేడుకల్లో సాక్షి మాలిక్‌ నాయకత్వం వహించారు
  • భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 1-3 తో బెల్జియం చేతిలో ఓడి, రియో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది

ఒలింపిక్స్‌ ప్రస్థానం...


  • అంతర్జాతీయ క్రీడా ఉత్సవాల్లో ఒలింపిక్స్‌ ప్రధానమైనవి
  • వీటిని క్రీ.పూ.776క్రీ.శ.393 మధ్య తొలిసారిగా నిర్వహించారు
  • బరాన్‌ ఫియర్రీ డీ కౌబర్టిన్‌ (ఫ్రాన్స్‌) కృషి వల్ల వీటిని మళ్లీ 1896లో పునఃప్రారంభించారు. వీటినే ఆధునిక ఒలింపిక్‌ క్రీడలు అంటారు
  • కౌబర్టిన్‌ను ఆధునిక ఒలింపిక్స్‌ పితామహుడిగా పేర్కొంటారు
  • ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని 1894 జూన్‌ 23న ఏర్పాటు చేశారు
  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ మొదటి అధ్యక్షుడు - డెమిట్రి యస్‌ వికిలాస్‌
  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు - థామస్‌ బాక్‌ 

  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యాయం స్విట్టర్లాండ్‌లోని లుసానేలో ఉంది

  • ఒలింపిక్‌ క్రీడలను ప్రతి 4 సం॥కు ఒకసారి నిర్వహిస్తారు
  • 1896లో గ్రీసు రాజధాని ఎథెన్స్‌లో మొట్టమొదటి ఒలింపిక్‌ క్రీడలను నిర్వహించారు
  • ఒలింపిక్స్‌ పతాకం మధ్యలో 5 వివిధ రంగులతో కూడిన 5 వలయాలు ఉంటాయి. ఇవి ప్రపంచంలోని ఖండాలకు ప్రతీక
  • ఒలింపిక్‌ క్రీడల విజేతకు 3 రకాల పతకాలు (స్వర్ణం, రజతం, కాంస్యం)ను ప్రదానం చేస్తారు
  • ఇప్పటివరకు ఆఫ్రికా ఖండంలో ఒలింపిక్స్‌ నిర్వహించలేదు
  • మొదటి, రెండో ప్రపంచ యుద్దాల కారణంగా 1916, 1940, 1944 సంవత్సరాల్లో ఒలింపిక్స్‌ నిర్వహించలేదు
  • 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తొలిసారిగా పాల్గొంది
  • భారత్‌ ఇప్పటివరకు మొత్తం 28 ఒలింపిక్స్‌ పతకాలను సాధించింది.
  • స్వర్ణాలు 9
  • రజతాలు 7
  • కాంస్యాలు 12
  • వీటిలో 11 (8 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు) పతకాలు హాకీ క్రీడలో లభించాయి
  • వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరపున ఏకైక స్వర్ణాన్ని 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా సాధించారు
  • 15వ పారా ఒలింపిక్స్‌ క్రీడలు
  • 2016 సెప్టెంబరు 7 నుంచి 18 వరకు బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనిరోలో జరిగాయి
  • వీటిని దివ్యాంగ క్రీడాకారు కోసం వేసవి ఒలింపిక్స్‌ జరిగిన కొన్నిరోజుకు అదే క్రీడా వేదికల్లో నిర్వహిస్తారు
  • రియో పారా ఒలింపిక్స్‌ క్రీడల్లో 176 దేశాు, 23 క్రీడల్లోని 528 ఈవెంట్స్‌లో పాల్గొంటాయి
  • రియో పారా ఒలింపిక్స్‌ మస్కట్‌ - టామ్‌

సాక్షి మాలిక్‌




  • రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన  క్రీడాకారిణి సాక్షి మాలిక్‌
  • ఈమె రెజ్లింగ్‌ మహిళ ఫ్రీస్టైల్‌ (58 కేజీు) విభాగంలోని రెపిఛేజ్‌ రౌండ్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐసు టినిటెకోవాపై 8-5తో విజయం సాధించి, కాంస్య పతకాన్ని గెలుపొందింది 
  • హర్యానాకు చెందిన సాక్షి మాలిక్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌ తరపున పతకం సాధించిన తొలి మహిళ
  • సాక్షి మాలిక్‌కు భారత ప్రభుత్వం 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందించింది

పీవీ సింధు




  • భారత క్రీడాకారిణి పి.వి. సింధు బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది
  • 21-19, 12-21, 15-21 తేడాతో రెండో స్థానంలో నిలిచిన సింధు రజత పతకాన్ని సాధించింది
  • ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత మహిళ పి.వి. సింధు 
  • స్వాతంత్య్రానంతరం భారత్‌కు ఇది 4వ వ్యక్తిగత రజత పతకం. గత విజేతలు రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ (2004 ఎథెన్స్‌ ఒలింపిక్స్‌), సుశీల్‌ కుమార్‌, విజయ్‌ కుమార్‌ (2012 లండన్‌ ఒలింపిక్స్‌), స్వాతంత్య్రానికి ముందు జరిగిన 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో నార్మన్‌ పిచర్డ్‌ 200 మీటర్ల పరుగులో 2 రజత పతకాలను సాధించాడు
  • ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్‌ - వెయిట్‌ లిఫ్టింగ్‌‌)
  • ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో తెలుగమ్మాయి సింధు
  • మొత్తంమీద ఒలింపిక్స్‌లో పతకం సాధించిన 5వ భారత మహిళ సింధు
          1. కరణం మల్లీశ్వరి
          2. సైనా నెహ్వాల్‌
          3. మేరీకోమ్‌
          4. సాక్షిమాలిక్‌
          5. పి.వి. సింధు
  • పి.వి. సింధు భారత ప్రభుత్వం నుంచి 2013 లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారం, 2016 సం॥నికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకుంది

దీపా కర్మాకర్‌ 




  • త్రిపురకు చెందిన మహిళా జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ మహిళ వాల్ట్‌ విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. కానీ, 0.15 పాయింట్ల తేడాతో పతకాన్ని కోల్పోయి 4 వ స్థానంలో నిలిచింది.
  • దీప ఫైనల్‌లో అత్యంత ప్రమాదకర విన్యాసమైన ప్రొడునోవాను ప్రదర్శించింది
  • దీప 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుపొందింది. జిమ్నాస్టిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా గుర్తింపు  పొందింది
  • భారత ప్రభుత్వం దీపా కర్మాకర్‌ను 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారంతో సత్కరించింది

లలిత బాబర్‌




  • భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో (గత 36 సంవత్సరాల్లో) ఒలింపిక్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళగా లలిత బాబర్‌ ఘనత సాధించింది
  • లలిత బాబర్‌ 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే బాబర్‌ ఫైనల్లో 10 వ స్థానంలో నిలిచింది
  • 1984లో 400 మీటర్ల హర్డిల్స్‌లో పీటీ ఉష ఫైనల్‌కు చేరింది

అభినవ్‌ బింద్రా




  • బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్‌ అభినవ్‌ బింద్రా రియో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచాడు

జీతూరాయ్‌ 


  • రియో ఒలింపిక్స్‌లో పురుషు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ జీతూరాయ్‌ 8వ స్థానంలో నిలిచాడు. ఇతడిని భారత ప్రభుత్వం 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారంతో సత్కరించింది

పతకాల పట్టిక (తొలి పది స్థానాలు)
దేశం                      స్వర్ణం     రజతం కాంస్యం మొత్తం
1. అమెరికా      46      37 38         121
2. బ్రిటన్‌              27      23 17         67
3. చైనా              26     18 19         56
4. రష్యా              19     18 19         56
5. జర్మనీ              17     10 15         42
6. జపాన్‌              12      8         21         41
7. ఫ్రాన్స్‌              10     18 14         42
8. కొరియా               9      3         9         21
9. ఇటలీ               8     12 8         28
10. ఆస్ట్రేలియా       8     11        10         29
67. భారత్‌       0     1        1         2

  • పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నివడం ఇది వరుసగా రెండోసారికాగా, మొత్తంగా ఇది 17వ సారి
  • ఫిజి (రగ్బీ), జోర్దాన్‌ (త్కెక్వాండో), కొసావో (జూడో) తొలిసారి ఒలింపిక్స్‌ పతకాలు గెలిచాయి
  • ఆర్చరీలోని 4 స్వరాలను దక్షిణ కొరియా గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం కొరియానే.
  • రియో ఒలింపిక్స్‌లో పోటీపడిన మొత్తం క్రీడాకారులు 11,303. వీరిలో 45 శాతం మహిళలు ఉన్నారు
  • ఒలింపిక్స్‌ డైవింగ్‌లో వు మింక్సియా 5 స్వర్ణాలు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి డైవర్‌ వు మింక్సియా 
  • స్ప్రింట్‌, పరుగు పోటీల్లో ట్రిపుల్‌ ట్రిపుల్‌ (9 స్వర్ణాలు) సాధించిన ఉసేన్‌ బోల్ట్‌, ఈత కొలనులో మరెవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదేమోనన్న రీతిలో 23 పసిడి పతకాతో సంచలనం సృష్టించిన మైకేల్‌ ఫెల్ప్‌ు రియోతో ఒలింపిక్స్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు
  • రియో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రగ్బీ సెవెన్స్‌లో ఫిజి ఏకంగా స్వర్ణాన్ని గెలిచింది. ఆ దేశ ఒలింపిక్‌ చరిత్రలో ఇదే తొలి పసిడి
  • టెన్నిస్‌లో మోనిక ఫ్యూగ్‌ మహిళ సింగిల్స్‌ స్వర్ణం గెలిచి ప్యూర్టోరికోకు తొలి స్వర్ణాన్ని అందించింది

No comments:

Post a Comment